Wednesday, 1 July 2020

సౌందర్య లహరి...శ్లోకము..3 అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ

అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరీ/
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి//3//

ఓ అమ్మా!తల్లీ!మాతా!నీ పాదరేణువు అజ్ఞానులకు,మూర్ఖులకు తామసమనే చీకటిని పారద్రోలే సూర్యద్వీపనగరము.ఆ నీ పాదలేశం మందబుద్ధులకు,చైతన్యంలేని జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే నిర్మల ప్రవాహము.లేమి చేత కుంగిపోయే దరిద్రులకు సకల సంపదలనిచ్చే చింతామణుల శ్రేణి.ఇవన్నీ కాకుండా చావు పుట్టుకలు కలగలసిన సంసారరూపమయిన సాగరంలో మునిగి తేలే వాళ్ళకి,ఒడ్డు కనిపించక,కానరాక తబ్బిబ్బు అయ్యే వాళ్ళకి శ్రీమహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి యొక్క కోర అవుతుంది.అంటే సగటు మానవులను ఉద్ధరించే ఆసరా అవుతుంది.ఈ సంసార సాగరాన్ని తరింప చేస్తుంది అని భావన.

No comments:

Post a Comment