Tuesday, 21 July 2020

త్వదీయం సౌన్దర్యం తుహినగిరి కన్యే తులయితుం

త్వదీయం సౌన్దర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీన్ద్రాః కల్పంతే కథమపి విరిఞ్చి ప్రభృతయః/
యదాలోకౌత్సుక్యా దమర లలనాయాన్తి మనసా
తపోభి ర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీమ్//

ఓ మాతా!తల్లీ!అమ్మా!హిమగిరి తనయా!నీ మేలిమి బంగారు లావణ్యాన్ని,అవయవాల సౌందర్యాన్ని సరిపోల్చి వర్ణించడానికి బ్రహ్మ,విష్ణువు,ఇంద్రుడు మొదలైన కవివరేణ్యులు వేరే ఏ వస్తువు కనిపించక గమ్మున ఉన్నారు.వాళ్ళకు నిన్ను తెలుసు కోవడం చేతకావటంలేదు.అలాంటి నీ లోకోత్తర సౌందర్యాన్ని చూడాలన్న కుతూహలం గలవారై అప్సరసలు నీ అందంతో పోలిస్తే వాళ్ళు  నీ కాలి కోటికి కూడా సరి కారు అనే నిష్టుర సత్యాన్ని తెలుసుకున్నారు.వారు ఇక తపస్సుల చేత కూడా పొందరానిదైన  పరమ శివుడి సాయుజ్య స్థానాన్ని మనస్సు చేత పొందేదానికి ఇచ్ఛ,ఉత్సాహం చూపిస్తున్నారు.అనగా ఒక్క పరమ శివుడికి మాత్రమే నీలో సాయుజ్యం పొందే అర్హత వుంది.అతను ఒక్కడే నీలో సాయుజ్యం పొందగలడు కాబట్టి వారు మొదట శివసాయుజ్యం పొంది తద్వారా నిన్ను చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.కానీ ఆ ప్రయత్నం లోనూ వాళ్ళు సఫలీకృతం కాలేక పోతున్నారు.కాకపోతే ఒక విధమైన మానసికమైన అనుభూతితో సంతృప్తి చెందుతున్నారు.

No comments:

Post a Comment