ప్రపంఞ్చం సిఞ్చన్తీ పునరపి రసామ్నాయ మహసః/
అవాప్య స్వాంభూమిం భుజగనిభనధ్యుష్టవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి//
ఓ మాతా!తల్లీ!అమ్మా!నీవు త్రిపురసుందరిగా మేమంత పిలుచుకునే కుండలిని శక్తివి.నీ పాదపద్మాల రెంటి మధ్య ప్రదేశం నుంచి స్రవించే అమృత ధారల చేత ఈ ప్రపంచాన్ని తడుపుతావు.అలా తడుపుతూ అమృతతుల్య కాంతి చే చంద్రుణ్ణి,అనగా సహస్రార కుండలిన శివసాయుజ్య మొందే స్థానం,వీడి స్వస్థానమైన మూలాధార చక్రాన్ని మరల ప్రాపించి,సుషమ్న చివరి భాగంలో స్వస్వరూపాన్ని గ్రహించి,సర్పం వలె చుట్ట చుట్టుకొని కుండలినీ శక్తిలా నిద్రిస్తావు.అది నాకే సాధ్యం తల్లీ!
No comments:
Post a Comment