Friday, 3 July 2020

సౌందర్య లహరి శ్లోకము 5 హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీమ్

హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీమ్
పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్/
స్మరోఽపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్//
ఓ జగన్మాతా! తల్లీ!అమ్మా!నువ్వు నీకు మ్రొక్కే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తావు.అలాంటి నిన్ను ఆరాధించి మునుపు శ్రీహరి సుందరాంగిగా మారి,త్రిపురాలను ధ్వంసం చేసి క్రోధాగ్నిలో ఉండే శివుడి మనసులో కామావికారాన్ని కలిగించి క్షోభ పెట్టగలిగాడు.అట్లాగే మన్మథుడు కూడా నిన్ను కొలిచాడు.ధానికి ఫలంగా తన సతి రతీదేవి కన్నులను రంజింపచేసే సౌందర్యాన్ని పొందాడు.అంతేనా!ఆ కళ్ళు చెదిరే సుందరమయిన రూపంతో అడవులలో తపస్సు చేసుకొనే మునుల మనసులలో కూడా కామాభిలాష కలిగించటంలో సమర్థుడైనాడు.ఔరౌరా!నీ ప్రసాద మహిమ అద్భుతం తల్లీ!

No comments:

Post a Comment