Wednesday, 29 July 2020

తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః

తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వాముర్వీ మరుణిమనిమగ్నాం స్మరతి యః/
భవన్త్యస్య త్రస్యద్వనహరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికితి న గీర్వాణ గణికాః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!భగవతీ!ఉదయిస్తున్న బాలసూర్యుడి కాంతి పుంజాలను నీ బంగారు మేను వెదజల్లుతున్నది.నీ ఒంటి నుంచి ప్రసరింపబడే ఆ కెంజాయలచేత భూమి,ఆకాశాలు కెంపు జిలుగుల మున్నీటిలో మునిగి తేలుతున్నాయి.అలాంటి నీ తేజోమయమైన దివ్య స్వరూపాన్ని ధ్యానించే భక్తుడికి బెదరిన లేడి కన్నుల వంటి కన్నులు గల అప్సరసలు,రంభ,మేనక,ఊర్వశి,తిలోత్తమలు సైతం వశులవుతారు.అంటే ఆ అమ్మ యొక్క లోకాతీతమయిన దివ్య మంగళ స్వరూపాన్నిధ్యానించేవారు సర్వ సమ్మోహన రూపానికి అర్హులు అవుతారు.ఈ ముల్లోకాలలో వారికి ఆకర్షితులు కాని వారంటూ ఎవరూ ఉండరు.

No comments:

Post a Comment