వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సఞ్చిన్తయతి యః/
స కర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః//
ఓ మాతా! తల్లీ!అమ్మా!జగదీశ్వరీ!నీ దివ్యస్వరూపం వాక్కులను సృజించేవారూ,చంద్రకాంత మణుల శకలాల లాగా తెల్లనయిన దేహ,ముఖ కాంతి గలవారు అయిన వశిన్యాది దేవతలచే కూడి ఉంది.అలాంటి నీ దివ్య స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో,అతడు ఖచ్చితంగా కవి శ్రేష్టుడవుతాడు.అతడు సమర్థుడైన కవితల్లజుడవుతాడు.అతని కవిత్వం మృదువైన వాగ్గుంభనలతో కూడి రుచిమంతంగా,రసమయ భరితంగా వుంటుంది.అతని కవితా స్రవంతి సరస్వతీ దేవి యొక్క ముఖ కమల పరిమణాలను వెదజల్లుతూ వుంటుంది.ఆ కవిత్వం శ్రోతల మనసులను,పాఠకుల మనసులను ఓలలాడిస్తుంది.
No comments:
Post a Comment