తవాపాఙ్గాలోకే పతిత మనుధావన్తి శతశః/
గనద్వేణీ బంధాః కుచకలశ విస్రస్త సిచయాః
హఠత్తృట్య త్కాంచ్యో విగళిత దుకూలా యువతయః//
ఓ మాతా!తల్లీ!అమ్మా!జగజ్జననీ!కనికరం ఉట్టిపడే నీ కడకంటి చూపుకు నోచుకున్న వాడు ఎవడైన సరే,వాడు ముసలి వాడు ఐనా,కురూపి అయినా,శృంగార పరిభాషలోమందబుద్ధికలవాడైనా,ఆడవాళ్ళు,యువతులు,ప్రౌఢలు అతగాడినే వలచి దాసోహం అంటారు.వారు తమ తమ కొప్పులు వీడి పోతున్నా,పైటలు జారిపోతున్నా,మొలనూళ్ళు నడుము నుంచి జారి పోతున్నా,కట్టుకున్న పట్టు చీరలు వాళ్ళ శరీరాలను కాదని జారి పోతున్నా వాళ్ళెవ్వరికీ ఆ స్పృహ వుండనే వుండదు.వందలాది వనితలు ఆ పురుషుడి వెంటబడి పరుగులు తీస్తూ వస్తారు.ఆ పురుషుడినే మనసా,వాచా,కర్మణా కోరుకుంటారు.దీనీ కంతటికీ కారణం ఏందంటే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడైన వాడే లోకోత్తర సుందరుడు అవుతాడు.దీనికి ఇంక తిరుగు లేదు.
No comments:
Post a Comment