వసన్త స్సామంతో మలయమరు దాయోధన రథః/
తథాఽప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే//6//
ఓ మాతా!తల్లీ!అమ్మా!హిమగిరి తనయ!మన్మథుడి విల్లు పువ్వులతో తయారయి వుంటుంది.వింటినారి ఏమో తుమ్మెదలువరస కట్టినట్లు వుంటుంది.అతని అంబుల పొదిలో పువ్వులతో తయారు అయిన ఐదు బాణాలు వుంటాయి.కాలానికి బద్దుడై మరల మరల వచ్చే వసంత ఋతువు అతనికి సామంతుడు.మన్మథుడు యుద్ధానికి తీసుకెళ్లే రథం ఎల్ల వేళలా కదిలే,రూపం లేని మలయ మారుతం.ఇలా ఏ ఒక్కటీ పనికిరాని పరికరాలు,సామగ్రి వుండే మన్మథుడికి అసలు రూపమనేదే లేదాయె.శరీర ధారుఢ్యం వుండే వాడు కాదు.ఇన్ని లొసుగులు వున్నా అతను నిన్ను ఆరాధించి,నీ కడకంటి కటాక్షంతో ఈ సమస్త జగత్తునే తన గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు.అదంతా నీ చలవే కదా!
No comments:
Post a Comment