Thursday, 2 July 2020

సౌందర్య లహరి శ్లోకము..4

త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా/
భయాత్త్రాతుం దాతుం ఫలమపిచ వాఞ్చాసమధికం
శరణ్యే లోకానాం తవహిచరణా వేవ నిపుణౌ//

ఓ మాతా!తల్లీ!అమ్మా!ఇంద్రుడు మొదలైన దేవతా గణాలు మొత్తం వారి వారి హస్తాలలో అభయ వర ముద్రలను పెట్టుకొని అందరికీ వరాలను,అభయాన్ని ప్రసాదిస్తున్నారు.కానీ నీవు మటుకు అలా వర,అభయ ముద్రలను పెట్టుకొని కనిపించవు.దానికి కారణం నాకు తెలుసు.ఓ అంబా!భగవతీ!లోకజననీ!భక్తులను వాళ్ళ భయాలనుంచి రక్షించేదానికి,వాళ్ళు కోరే కోర్కెలకన్నా ఎక్కువ ఫలం,ఫలితం ఇచ్చేదానికి ఆడంబరాలు అవసరం లేదని నీ ఉద్దేశం.మా లాటి భక్తులకు ఏ ఆడంబరములు,బాహ్య ప్రదర్శన లేని నీ పాదకమలములు చాలు.

No comments:

Post a Comment