సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే/
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయామ్
మణిద్వీపే నీపోపవనవతి చిన్తామణిగృహే/
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయామ్
భజన్తి త్వాం ధన్యాస కతిచన చిదానందలహరీమ్//8//
అమ్మా!తల్లీ!మాతా!నీవు పాలకడలి నడుమ వుండే రత్నాల దీవిలో వుంటావు.అక్కడ అంతా కల్ప వృక్షాల వరుసలు వుంటాయి.ఆ లోపల కదంబ చెట్ల పూదోటలు వుంటాయి.వాటి మధ్యలో చింతామణులతో నిర్మింపబడిన నీ గృహం వుంటుంది.ఆ గృహంలో నీవు పరమ శివుని పర్యఙ్కనిలయవై వుంటావు.అంతేనా?అలా మంగళ రూపమైన త్రికోణపు పాన్పు పైన నిరంతరమూ నిరతిశయానంద ప్రవాహ స్వరూపిణివి అయిన నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవిస్తున్నారు.జగన్మాతా!అందరికీ నిన్ను సేవించే అదృష్టం లభించదు కదా!
No comments:
Post a Comment