Wednesday, 11 March 2026
కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా
కామేశ బద్ధ మాంగల్ల సూత్రశోభిత కంధరా అనే పవిత్రమయిన నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని ముప్పయవ నామము.
పరమశివుడు కట్టిన మంగళసూత్రము అమ్మవారి కంఠసీమను అలంకరించి యున్నది.ఆమె గళసీమలో ఆ మంగళసూత్రము శోభాయమానంగా,కన్నులపండువగా ఉంది.దేవతలు పార్వతిని,పరమేశ్వరుడిని కలపమని మన్మథుడిని పంపిస్తారు.
శివుడి తపస్సు భంగం అయిందనే కోపంతో మన్మథుడిని భస్మం చేసాడు.పార్వతి శివుడి కోసం భీకరమయిన తపస్సు చేసింది.పర్ణాలు అనగా రాలిన ఆకులు మటుకు తిని తపస్సు చేసింది.తరువాత అవి కూడా తినడం ఆపేసింది.అందుకని ఆమెకు అపర్ణ అనే పేరు వచ్చింది.పార్వతి తపస్సు మెచ్చి పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి,పార్వతిని పెళ్ళి చేసుకుంటాడు.సంసారానికి మూలం మన్మథుడు కాబట్టి పార్వతి మన్మథుడిని మళ్ళీ బ్రతికించినట్లయింది.కామేశుడు తన మెడలో కట్టిన మంగళసూత్రము చేత ఆ కంఠము ప్రకాశిస్తూ,వెలిగిపోతుంది.అందుకనే వశిన్యాది వాగ్దేవతలు ఆమెను ప్రేమగా,మురిపెంగా కామేశ బద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా అని పిలుచుకున్నారు.ఆమెకు తన మంగళసూత్రము పైన ఎంత నమ్మకం అంటే శివుడు లోక కళ్యాణం కోసరము విషం త్రాగుతానంటే వెనక్కి లాగలేదు.సరే అని ప్రోత్సహించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment