Monday, 13 April 2026

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని మంగళప్రదమయిన నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో పెట్టబడిన నలభైవ నామము. అమ్మవారు మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పలతో విరాజిల్లుతున్నది. శంకరాచార్యులవారు అమ్మవారి మోకాలు చిప్పలగురించి ఇలా ప్రస్తావించారు.ఆమె జానువులు,అనగా మోకాళ్ళు,చాలా కఠినంగా ఉన్నాయి.ఆమె ముల్లోకాలకు తల్లి అయినా,పతివ్రతా ధర్మాన్ని తు.చ.తప్పకుండా పాటించింది.అను నిత్యమూ కామేశుడికి సేవలు చేస్తుంది.భక్తిగా మోకాళ్ళపైన పాదాభివందనం చేస్తుంది.కాబట్టే ఆమె మోకాలి చిప్పలు ఐరావతం యొక్క కుంభస్థలం అంత గట్టిగా ఉన్నాయి.కామేశుడికే తెలిసినవి అనడంలో ఒక నిగూఢమయిన పరమార్థం కూడా ఉంది.పార్వతీ పరమేశ్వరులు అర్థనారీశ్వరులు కదా!శంకరుడు పద్మాసనంలో కూర్చుంటాడు కదా!అప్పుడు ఎడమ తొడ మీదకు కుడి అరికాలు ఆనుతుంది కదా!ఇక్కడ ఎడమ తొడ అమ్మవారిది.కుడి అరిపాదం అయ్యవారిది.ఆ అరికాలి స్పర్శతో అమ్మవారి తొడ మృదత్వం అయ్యవారికి ఎరుకయింది.అంతే కానీ ఇంకో రకంగా కాదు అని శంకరాచార్యులవారి ఉవాచ. అన్మ ఎర్రని చీర కట్టుకుని ఉంది.కాబట్టి ఆమె మోకాళ్ళు ఆ ఎర్రని చీరతో కప్పబడి ఉండటంతో మాణిక్యాలలాగా వెలిగి పోతున్నాయి అని కూడా చెబుతున్నారు.

1 comment: