Wednesday, 11 February 2026
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా అను అమ్మవారి నామము శ్రీలలితా సహస్ర నామావళిలోని పండ్రెండవ నామము.
అమ్మవారి శరీరము ఎర్రని అరుణకాంతులతో విరాజిల్లుతున్నది.ఆమె తన అరుణారుణ కాంతులతో సమస్త బ్రహ్మాండాన్ని వెలుగులతో నింపుతున్నది.ఆ శరీరపు వెలుగు జిలుగులు ఆమెకు స్వతహాగా ఉన్నవి.ఈ సృష్టి మొత్తము ఆమె సృజనే కదా!కావున ఈ బ్రహ్మాండములు అన్నీ ఆమె శరీరము యొక్క అరుణ కాంతుల శోభతో ప్రకాశిస్తున్నాయి.వెలిగిపోతున్నాయి.అమ్మవారి తాటంకములు సూర్యచంద్రులు.అలగే అమ్మవారి త్రినేత్రములు సూర్యచంద్రుల అగ్నిగోళాలు.ఇడ,పింగళ,సుషుమ్న నాడుల అధిష్ఠాన దేవతలు కూడా సూర్యచంద్రాగ్నులే!ఒక రకంగా అభివర్ణించాలంటే ఆమె పాదములనుండే ఈ సూర్యచంద్రాగ్ని మండలములకు ఆ కాంతులు,ఆ వెలుగులు,ఆ శోభ లభించాయి.అలాగే చంద్రమండలమునకు శీతలత్వము ,అమృత తత్వము ఆ తల్లి సహస్రారము నుండే లభించి ఉన్నాయి.
ఆ పరమేశ్వరి వలన సూర్యచంద్రులకు వెలుగు సమకూరింది.వాటి వలన ఆ తల్లికి కాదు.
ఇలా సహస్రకోటి కిరణాల సమాహారంగా,దేదీప్యమానంగా వెలుగొందుతుంది కాబట్టి ఆ తల్లికి నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా అనే నామము సార్థకమయినది.
Subscribe to:
Post Comments (Atom)
🙏
ReplyDelete