Sunday, 2 August 2026
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా అను అద్భుత నామము అమ్మవారికి శ్రీ సలితా సహస్ర నామావళిలో డెబ్బై నాలుగవ నామముగా చెప్పబడినది.భండుడికి ముప్పై మంది కుమారులు ఉన్నారు.వారందరూ కూడా తమ తండ్రి తరఫున యుద్ధంలో పాల్గొన్నారు.వారందరూ మూకమ్ముడిగా అమ్మవారి పైకి దూసుకొచ్చారు.అప్పుడు అమ్మ తన అంశం నుండి తొమ్మిది సంవత్సరాల బాలా త్రిపుర సుందరిని ఉద్భవింపచేసింది.ఆ బాలను భండుడి కొడుకులతో పోరు సల్పమని ఆదేశించింది.అప్పుడు ఆ బాలా కుమారి అయిన బాలా త్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి ఇచ్చిన రథం ఎక్కింది.సర్వాయుథ పరిష్కృత అయింది.అమ్మకు ఎన్ని శక్తులు ఉన్నాయో బిడ్డకు కూడా అన్నీ శక్తులు ఉన్నాయి.ఇంక చండ ప్రచండంగా యుద్ధభూమిలోకి అడుగు పెట్టింది.ఎత్తిన కరవాలం దించకుండా,భండుని సైన్యాన్ని దాటింది.సుడిగాలి లాగా భండుడి పుత్రులను ఏరిపారేసింది.ఆమె అలా వారిని దునుముతూ,తుత్తినియలు చేస్తుంటే...।అమ్మవారి ఆనందానికి అంతమే లేకుండా పోయింది.అమ్మవారి ఆనందానికి ఆకాశపుటంచులు కూడా హద్దులు కాలేక చిన్నబుచ్చుకున్నాయి.
భండుని పుత్రులు...చతుర్బాహువు,చకోరాక్షుడు,చతుశిరస్కుడు, వజ్రఘోషుడు,ఊర్థ్వకేసుడు,మహాకాయుడు,మహాహనువు,ముఖశత్రువు,మఖస్కందుడు,సింహఘోషుడు,విరాలకుడు,లశునుడు,కుట్టిశేనుడు,పురజిత్తు,పూర్యరనూకుడు,సర్గశత్రువు,ఇంద్రశత్రువు,అమీత్రకుడు,విద్యున్మాలి,ఉగ్రకర్మ,ఉగ్రధన్వా, స్వర్గపీడుడు,దుర్గుడు,స్వర్గకంటకుడు,అతిమాయుడు,బృహన్నాయుడు,విభీషణుడు,శృతిపారగుడు,విదురుడు మరియు ఉపమాయువు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment