Saturday, 8 August 2026
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్య నందితా అను అద్వితీయ నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై ఆరవ నామముగా చెప్పబడినది.భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు అతని బాహువుల నుంచి ఉద్భవించారు.అతనికి నిజంగానే కుడి,ఎడమ భుజాలలాగానే ఇరు వైపులా ఉంటారు.అతనికి రక్షకులుగా,సేనా నాయకులుగా ఉంటారు.వారే విషంగుడు,విశుక్రుడు.వారాహీ దేవి అమ్మవారి సేనాని కదా!ఆమె విశుక్రుని హతమార్చింది.ఆ ఘటన,సంఘటన జరిగేటప్పుడు ఆమె చూపిన పరాక్రమము అంతా ఇంతా కాదు.అమ్మవారు ముగ్ధురాలు అయి చూసింది.మహదానందపడిపోయింది.
మనలో శుక్ర ధాతువు ఉంటుంది కదా!అది కామోద్రేకాన్ని ప్రేరేపిస్తుంది.ఇక్కడ విశుక్రుడు శుక్రధాతువు లాంటి వాడు.వారాహీ దేవి వాడిని నామరూపాలు లేకుండా చేసింది అంటే అర్థం ఏంది?ఆ తల్లి మనలో ఉండే కామాన్ని కూడా రూపుమాపుతుంది అని.కామాన్ని పక్కన పెట్టిన తరువాతే మానవుడు దేవుడు,దైవము గురించి ఆలోచించగలతాడు.సప్త మాతృకలలో వారాహీ దేవి ఒక దేవత.మిగిలిన వారు బ్రాహ్మి,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి,మాహేంద్రి మరియు చాముండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment