Tuesday, 4 August 2026

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా అను దివ్య నామము అమ్మవారికి శ్రీ లలితా సహస్ర నామావళిలో డెబ్బై అయిదవ నామముగా చెప్పబడినది. భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు.వారు విషంగుడు మరియు విశుక్రుడు.అమ్మవారి మంత్రిణి అయిన శ్యామలా దేవి,(రాజ శ్యామలా)విషంగుడిని సంహరించింది.ఆ దృశ్యము చూసి అమ్మవారు అమితంగా సంతోషపడింది. రాక్షసులు అంటే విషయాసక్తులు,అజ్ఞానులు.అరిషడ్వర్గాలకు ప్రతిరూపాలు.లేకుంటే వారు తపోబల సంపన్నులు,మహాబలవంతులు.ప్రవృత్తి రూపేణా రక్కసులు అయ్యారు.విషంగుడు అంటే విషయలాలసానికి,విషయలంపటం జోడించి,రెచ్చగొట్టేవాడు.విషయలంపటం అంటే ఏముంది?క్రోథ,లోభ,మోహ,మద,మాత్సర్యాలే కదా!ఈ లంపటాన్ని ఛేదించగల శక్తి ఉండేది మన రాజశ్యామలా దేవికే!కాబట్టే మహానిత్యా ఆమెను పంపింది అరిషడ్వర్గ సంహారానికి.

No comments:

Post a Comment