Tuesday, 6 January 2026
శ్రీమత్సింహాసనేశ్వరి
శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము శ్రీ లలితా సహస్ర నామావళి లోని మూడవ నామము.
సింహం అడవికి రాజు.ఆ సింహాన్నే తన బంటుగా చేసుకుంది ఆ పరమేశ్వరి.దానిని అథిరోహించింది.దానినే తన ఆసనం చేసుకుంది.అందుకే శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామము సార్థకమయినది.
శోభాయమానమయిన సింహముఖ మేర్పరచిన స్వర్ణ పీఠమును అధిష్టించిన ఈశ్వరి కావున శ్రీమత్ సింహాసనేశ్వరి అయినది.
సింహము మనలోని పాశవికత,హింసాత్మక లక్షణానికి ప్రతీక.అలాంటిది ఆ దుష్ట,క్రూర సింహాన్ని అదుపులోకి తెచ్చుకుంటేనే కదా దానిని ఎక్కగలిగేది.శ్రీ లలితా పరమేశ్వరి సింహాన్ని ఎక్కి మహిషాసుర మర్దనకు బయలుదేరి ఆ అసురుడి అంతం చూసింది.అప్పటి నుంచీ ఆమెను సింహాసనేశ్వరి అని పిలుస్తున్నారు.
ఆమె అధిష్టించిన పీఠానికి అయిదు కోళ్ళు ఉంటాయి.పంచ బ్రహ్మలు అనగా బ్రహ్మ,విష్ణువు,రుద్రుడు,మహేశ్వరుడు,సదాశివుడు ఆమెను అతి దగ్గరగా ఉండి సేవించుకోవాలనుకున్నారు.వారు ఒక ఆసనము ఏర్పరచి దాని నాలుగుకోళ్ళు అయినారు.సదాశివుడు అయిదవ కోడు,పరుపులాగ అయ్యాడు.
Subscribe to:
Post Comments (Atom)
👌🙏
ReplyDelete