Tuesday, 4 August 2020

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శఙ్కే హృతమభూత్/
యదేత త్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్//

ఓ జగన్మాతా!తల్లీ!అమ్మా!నీవు ముందర శివశంభుడి వామ భాగాన్ని గ్రహించావు.అయినా నీకు తనివి తీర లేదనిపిస్తుంది.ఎందుకంటే తనివితీరని మనస్సుతో అర్థనారీశ్వరుడి ఆ మిగిలిన సగ భాగంకూడా ఆక్రమించావనిపిస్తుంది.నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే నా హృదయఫలకం పైన విరాజిల్లుతున్న నీ దివ్య స్వరూపం అలా గోచరిస్తున్నది.నీ దివ్య స్వరూపం ఉదయ భానుడి కాంతితో సాటి వచ్చే కెంపు కాంతులతో ఒప్పారుతూ వుంది.పాలిండ్ల జంటతో యించుక ముందుకు వంగినట్లు కనపడుతూ వుంది.ఆ నీ దివ్య స్వరూపం మూడు కన్నులు కలిగి,వంపు తిరిగిన చంద్రకళ శిరోమణిగా ఉన్న కిరీటంతో సొంపారుతూ,విరాజిల్లితుంది.దీని భావం ఏందంటే అమ్మవారు తనలో శివతత్త్వాన్ని లయం చేసుకున్నారని.

No comments:

Post a Comment