Wednesday, 12 August 2020

త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే

త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా తవ చరణయో ర్యా విరచితా/
తథాహి త్వత్పాదోద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతో శశ్వ న్ముకుళిత కరోత్తం సమకుటాః//

ఓ మాతా!తల్లీ!అమ్మా!శివానీ!త్రిమూర్తులు నీ త్రిగుణాలవలన జనించిన వారే కదా.కావున నీ చరణాలకు మేము చేసే పూజే వారికి కూడా చేసే పూజ అవుతుంది.వారికి ఇంక వేరే పూజలు అవసరము లేదు.ఎందుకంటే వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచ్చిత పీఠానికి దగ్గరగా చేరి,చేతులు తమ మణిమయ శిరోముకుటాలకు తాకేటట్లు పెట్టుకొని నీకు మొక్కుతూ వుంటారు.సర్వకాల సర్వావస్థలలో నీ ఆజ్ఞను శిరసావహిస్తుంటారు.కాబట్టి ఆతల్లి పాదసేవ ఆమె కటాక్షిస్తేనే మనకు దక్కేది అని దీని అంతరార్థం.

No comments:

Post a Comment